సోనూసూద్ సలహా… ఆ పని చేయమని తన పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటాడట… తాను ఆ పనే చేసే వాడట…

| Edited By:

Dec 12, 2020 | 6:59 PM

రేడియో జాకీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సోనూసూద్ తన పిల్లలకు ఎప్పుడూ వార్తా పత్రికలు చదవమని చెబుతానని అన్నారు. తాను స్కూల్‌లో ప్రతి రోజు పేపర్ చదివేవాడినని తెలిపారు.

సోనూసూద్ సలహా... ఆ పని చేయమని తన పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటాడట... తాను ఆ పనే చేసే వాడట...
Follow us on

కరోనా కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుపోయిన భారతీయులకు అతడు దిక్కైయ్యాడు. హక్కున చేర్చుకున్నాడు. ఆదరించాడు. అన్నంపెట్టాడు. అన్నార్తులకు, వ్యాధిగ్రస్తులకు, కష్టమన్న ప్రతీ ఒక్కరికి ఆపన్న హస్తమందిస్తున్నాడు. ఇప్పుడు ఆస్తులను తనఖా పెట్టి మరి సాయమందిస్తున్నాడు. అతడే నవ భారత కర్ణుడు సోనూసూద్. అయితే సోనూసూద్ ఇటీవల రేడియో మిర్చితో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పాడు. అవేంటంటే….

రోజులో భాగం….

రేడియో జాకీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సోనూసూద్ మాట్లాడుతూ… తన పిల్లలకు ఎప్పుడూ వార్తా పత్రికలు చదవమని చెబుతానని అన్నారు. తాను స్కూల్‌లో ప్రతి రోజు పేపర్ చదివేవానని… దాదాపు 20 నిమిషాలు పేపర్ చదివి… చదివిన దాన్ని రాసి టీచర్లకు చూపించేవాడినని తెలిపారు. అలా పేపర్ నా జీవితంలో భాగమైందని అన్నారు. అందుకే తన పిల్లలకు పేపర్ చదువుమని సలహా ఇస్తానని అన్నారు.