కర్ణాటక రాజ్ భవన్ లో పాముల బెడద ఎక్కువయ్యింది. బెంగుళూర్ లోని గవర్నర్ నివాసంలోకి భారీ సర్పం ప్రవేశించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు రాజ్ భవన్ సిబ్బంది. రాజ్ భవన్ కు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది భారీ సర్పాన్ని బంధించారు. బంధించిన ఆరడుగుల పామును అడవిలోకి వదిలేశారు. రాజ్ భవన్ ప్రాంగణంలోకి తరుచుగా పాములు ప్రవేశిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు.