ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..

|

Oct 22, 2019 | 1:31 PM

35 ఏళ్ళ అనంతరం సియాచిన్ మళ్ళీ ప్రారంభమైంది. లడఖ్ లో ఉన్న ఈ ప్రాంతం తిరిగి టూరిస్టులతో కళకళలాడబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ను ప్రకటించడానికి ముందు సియాచిన్ లోని అత్యంత ప్రధానమైన ‘ కల్నల్ చెవాంగ్ రిచెన్ సేతు ‘ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇన్నాళ్లూ మూసివేసిన 430 మీటర్ల పొడవైన ఈ వంతెనను తిరిగి ప్రారంభించడం వల్ల క్రమేపీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం […]

ఛలో లడఖ్ ! ఇక సియాచిన్.. టూరిస్టుల స్వర్గధామం..
Follow us on

35 ఏళ్ళ అనంతరం సియాచిన్ మళ్ళీ ప్రారంభమైంది. లడఖ్ లో ఉన్న ఈ ప్రాంతం తిరిగి టూరిస్టులతో కళకళలాడబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ను ప్రకటించడానికి ముందు సియాచిన్ లోని అత్యంత ప్రధానమైన ‘ కల్నల్ చెవాంగ్ రిచెన్ సేతు ‘ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇన్నాళ్లూ మూసివేసిన 430 మీటర్ల పొడవైన ఈ వంతెనను తిరిగి ప్రారంభించడం వల్ల క్రమేపీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో సియాచిన్ పై కన్నేసిన పాకిస్తాన్.. 1980 ప్రాంతాల్లో తన సైనిక దళాలను ఇక్కడ మోహరించే ప్రయత్నం చేసింది. ఆ దేశ ‘ దుస్సాహసం ‘ పై మండిపడిన భారత్ వెంటనే తానూ మన జవాన్లను ఈ ప్రాంతానికి తరలించింది.1984 లో చేబట్టిన ‘ ఆపరేషన్ మేఘదూత్ ‘ ఇందులో భాగమే ! అప్పటినుంచీ ఈ ప్రాంతం భారత ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. ఇక్కడి ఎత్తయిన పర్వతాలు, హిమ నదీనదాలు, టూరిస్టులను ఎంతో ఆకర్షించాయి. కారాకోరం రేంజిలో సముద్ర మట్టానికి సుమారు 20 వేల అడుగుల ఎత్తున ఉంది సియాచిన్ గ్లేసియర్.. కొండచరియలు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తాయి. . శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పడిపోయినప్పటికీ.. పర్యాటకులు నులివెచ్చ్చని స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించి ఈ ప్రాంత అందాలను ఆస్వాదిస్తారు. ఇన్నేళ్లకు సియాచిన్ గ్లేసియర్ మళ్ళీ టూరిస్టులకు కనువిందు చేయబోతోంది. అలాగే లడఖ్ ప్రాంత ఆదాయం కూడా పెరగనుంది.