కరోనా లాక్‌డౌన్ తో.. డెయిరీ, పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. 

| Edited By:

Jul 12, 2020 | 6:19 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల

కరోనా లాక్‌డౌన్ తో.. డెయిరీ, పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాలు.. 
Follow us on

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల డెయిరీ, పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బాలలకు పోషకాహారం అందజేయాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఈ రెండు రంగాల వ్యాపారానికి గట్టి హామీగా ఉంటోంది. ఈ మహమ్మారి అటు బాలలకు, ఇటు రైతులకు కష్టాలు మిగుల్చుతోంది.

వివరాల్లోకెళితే.. గుజరాత్‌లో దూద్ సంజీవని యోజనను విద్యార్థినీ, విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారు. కర్ణాటకలో క్షీర భాగ్య పథకం కింద పాఠశాలలు, అంగన్ వాడీల్లో చదువుతున్న బాలలకు పాలు పంపిణీ చేస్తారు. ఈ పథకాల కింద బాలలకు పాలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణాలో అంగన్‌వాడీ బాలలకు వారానికి ఒక్కొక్కరికి 7 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఒడిశాలో 5, ఆంధ్ర ప్రదేశ్‌లో 4, తమిళనాడు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో 3, కర్ణాటకలో 2, బీహార్, త్రిపురలలో ఒకటి చొప్పున గుడ్లు ఇస్తున్నారు.

ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో చదివే బాలలకు వారానికి ఒక్కొక్కరికి 5 గుడ్లు  ఇస్తున్నారు. తెలంగాణాలో వారానికి మూడుసార్లు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో వారానికి రెండుసార్లు గుడ్లు ఇస్తున్నారు. కేరళ, బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరులలో వారానికి ఒకసారి గుడ్లు పంపిణీ చేస్తారు. దేశంలో రోజుకు 25 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో 2 కోట్ల గుడ్లకు కచ్చితమైన మార్కెట్‌గా పాఠశాలలు, అంగన్‌వాడీలు నిలుస్తున్నాయి.