బ్రేకింగ్ : షిర్డీ సాయి ఆలయం మూసివేత..

|

Mar 17, 2020 | 3:00 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ వేగంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 140 పైగా దేశాలను ఈ మహమ్మారి వైరస్ ఛిన్నాభిన్నం చేస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. ఇండియా కూడా ముందస్తు చర్యల్లో నిమగ్నమైంది. రాష్ట్రాలకు ఇప్పటికే […]

బ్రేకింగ్ : షిర్డీ సాయి ఆలయం మూసివేత..
Follow us on

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకూ వేగంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 140 పైగా దేశాలను ఈ మహమ్మారి వైరస్ ఛిన్నాభిన్నం చేస్తోంది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. ఇండియా కూడా ముందస్తు చర్యల్లో నిమగ్నమైంది. రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని మార్గనిర్దేశకాలు విడుదల చేసింది. దీంతో చాలా స్టేట్స్‌లో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. ఇప్పుటికే స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, బార్లు, పబ్స్ అన్ని మూసివేశారు. తాజాగా వివిధ ఆలయాలకు సంబంధించిన పాలనాధికారులు సమావేశమై దేవాలయాలను మూసివేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు.

తాజాగా కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీపై కూడా పడింది. మంగళవారం (మార్చి 17,2020) మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన విడుదల యచేసింది. దర్శనాలు పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసే ఉంటుదని, భక్తులు సాయి దర్శనానికి రావొద్దని ట్రస్ట్ కోరింది. జన సమూహం అధికంగా ఉండే షిర్డీలో కరోనా ప్రబలకుండా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.