కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆయన చేసే ట్వీట్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఆయనో ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఫొటోను ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్ స్పియర్ ఫొటోను ఎవరో మార్ఫింగ్ చేసి థరూర్కు పంపారు. దీన్ని ఆయన ట్వీట్ చేశారు.
‘వాట్సాప్లో తెగ వైరల్ అయి ప్రశంసలు దక్కించుకున్న ఫొటో ఇది. ఈ విధంగా నా ఫొటోను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. దీన్ని సృష్టించడానికి వాళ్లు(ఫొటోను మార్ఫింగ్ చేసిన వాళ్లు) చాలా కష్టపడి ఉంటారనుకుంటాను. ఇది ఎవరు చేశారో వాళ్లకి ధన్యవాదాలు. నేను షేక్స్పియర్తో పోల్చకునేంత గొప్ప వ్యక్తిని కాదు’ అని ట్వీట్ చేసి ఈ ఫొటో షేర్ చేశారు. ఈ ట్వీట్ కాసేపటికే వైరల్ అయింది.
అయితే, ఈ ట్వీట్పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు థరూర్కు బాసటగా నిలిచారు. కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఎంపీ ఇలా కాలక్షేపం చేస్తున్నారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేశారు. వీటిని మరి కొందరు తిప్పి కొట్టారు. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి థరూర్ ట్వీట్లు చేస్తున్నారు. బాధితులను ఆదుకోవడానికి యువత ముందుకు రావాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.
The most flattering image going around on What’s App today — amazed that someone thought of making me into Shakespeare & then actually took the trouble to create this! Thanks to whoever did so (though i am completely unworthy of the honour!) pic.twitter.com/F0uWV0m7Zw
— Shashi Tharoor (@ShashiTharoor) August 10, 2019