చైనాలో మ‌రో కొత్త‌ అంటువ్యాధి​.. ఏడుగురు మృతి !

|

Aug 05, 2020 | 11:02 PM

చైనాలో పుట్టిన క‌రోనా కరోనా మహమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అక్క‌డ మ‌రో కొత్త అంటువ్యాధి​ బయటపడింది.

చైనాలో మ‌రో కొత్త‌ అంటువ్యాధి​.. ఏడుగురు మృతి !
Follow us on

New infectious disease  in China: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అక్క‌డ మ‌రో కొత్త అంటువ్యాధి​ బయటపడింది. టిక్​-బార్న్​ వైరస్​తో కొత్త అంటువ్యాధి సోకి ఏడుగురు చ‌నిపోయారు. మరో 60 మంది వైరస్​ బారినప‌డి ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. ఈ వైరస్​.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బాంబు పేల్చింది.

జియాంగ్ఝు కేపిట‌ల్ సిటీ నాన్జింగ్​కు చెందిన ఓ మహిళకు వైరస్​ సోక‌గా.. ఆమెలో జ్వరం, దగ్గు వంటి సింట‌మ్స్ క‌నిపించాయ‌ని, శరీరంలో ల్యూకోసైట్​, రక్తంలో ప్లేట్​లెట్​లు తీవ్రంగా త‌గ్గిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. ఒక నెల రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన‌ తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అయితే.. ఎస్​ఎఫ్​టీఎస్​ వైరస్​ కొత్తది కాదని.. 2011లోనే ఈ వైరస్​ను ఐడెంటిఫై చేసిన‌ట్లు మీడియా వెల్ల‌డించింది. ఇది బన్యావైరస్​ వర్గానికి చెందినదిగా తెలిపింది. కీటకాలు కుట్టడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని వైద్య నిపుణ‌లు చెబుతున్నారు. .

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్