Serial Actress Sravani Suicide Case: శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి, దేవరాజ్తో ఆమె ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తోంది. మొదట సాయితో ప్రేమాయణం నడిపిన శ్రావణి.. ఆ తర్వాత పరిచయమైన దేవరాజ్తో లవ్లో పడింది. దేవరాజ్తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా అతనిపై శ్రావణికి ప్రేమ తగ్గలేదు. కుటుంబ సభ్యులకు, సాయికి తెలియకుండానే దేవరాజ్ను శ్రావణి కలిసేది. కుటుంబసభ్యులు, సాయితో ఆమెకు జరిగిన గొడవే ఇందుకు నిదర్శనం.
ఇదిలా ఉంటే శ్రావణి.. తన ఇంట్లో జరుగుతున్న గొడవను దేవరాజ్కు కాల్ చేసి వినిపించింది. దేవరాజ్ తెలివిగా జరుగుతున్న గొడవను ఓ వైపు ఫోన్లో వింటూనే మరోవైపు కాల్ రికార్డ్ చేశాడు. సుమారు అరగంట జరిగిన గోడవను దేవరాజ్ రికార్డ్ చేసి సేఫ్గా ఉంచుకున్నాడు. ఇక శ్రావణి ఆత్మహత్య తర్వాత దేవరాజ్ను అదుపులోకి తీసుకోవడంతో ఆడియో సొషల్ మీడియాలో లీకైంది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలో దేవరాజ్పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. రెస్టారెంట్లో తనను సాయి అందరి ముందు కొట్టడం.. లిఫ్ట్ వద్ద కొట్టడం.. ఎంతవరకు కరెక్ట్ అని తల్లిని శ్రావణి నిలదీసింది.
Also Read:
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!
బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్ టికెట్స్ వచ్చేశాయి..