విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై స్పందించారు ప్రముఖ హీరో చిరంజీవి. విశాఖలో విషవాయువు స్టెరిన్ బారిన పడి ప్రజలు మరణించటం మనసుని కలిచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు చిరంజీవి. అలాగే అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు చిరంజీవి.
కాగా ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా, సీఎం జగన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తదితరులు స్పందించారు. అలాగే విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందగా, 80 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020
Read More:
మీ అకౌంట్లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి!
హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు