SBI Microsoft: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో దివ్యాంగ యువతకు అవకాశాలు కల్పించడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ కోర్టోయిస్ కలిసి మూడేళ్ల ప్రోగ్రామ్ను లాంఛ్ చేశారు. BFSI రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా దివ్యాంగులకు టెక్నాలజీలో శిక్షణ అందిస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి మొదటి ఏడాదిలోనే 500 మందికి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.
ఈ కార్యక్రమం వివిధ ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల నైపుణ్య సంస్థలు, లాభాపేక్షలేని సంస్థల సహకారంతో నడుస్తుంది.ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వడంతో పాటు, దివ్యాంగులు సరైన నైపుణ్యాలతో ఈ రంగంలో అడుగుపెట్టేలా చేయడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ రంగంలో నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఎస్బీఐ, మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి.
భారతదేశంలో 26 మిలియన్లకు పైగా దివ్యాంగులు 21 వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా పాల్గొనడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి కొత్త మార్గాలను కనుగొనడం చాలా అవసరం. ఎస్బిఐ ఫౌండేషన్తో భాగస్వామ్యం చేయడం ద్వారా దివ్యాంగులు బిఎస్ఎఫ్ఐ రంగానికి ప్రయోజనం కలిగించే అద్భుతమైన అవకాశం ఉంది అని కోర్టోయిస్ చెప్పారు.
[svt-event date=”27/02/2020,4:39PM” class=”svt-cd-green” ]
A program between Microsoft & the SBI Foundation has been launched for better integration of youth living with disabilities into the BFSI workforce, along with the development of an AI powered marketplace for further upskilling and opportunities. Visit: https://t.co/nedC95ou2r pic.twitter.com/JNckVs1BXT
— State Bank of India (@TheOfficialSBI) February 27, 2020