ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్బీఐ) అదిరిపోయే బంపర్ ఆఫర్ను ప్రకటించింది. తన కస్టమర్లకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపు, మరో 10 పర్సెంట్ అదనపు క్యాష్బ్యాక్ను అందిస్తోంది. ఓయో రూమ్స్ను ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. నవంబర్ 10కి ఇది ముగుస్తుందని చెప్పింది. ఇక ఈ ఆఫర్ను కస్టమర్లు పొందాలంటే OYOYONO అనే ప్రోమో కోడ్ను ఉపయోగించాలి. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలోని హోటల్ బుకింగ్స్పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందట.