‘ఆహా’ వేదికగా సమంతా టాక్ షో.. ఎంజాయ్‌మెంట్‌ మాములుగా ఉండదు..

|

Nov 06, 2020 | 5:43 PM

అక్కినేని నాగార్జున స్థానంలో ‘బిగ్ బాస్’ సీజన్ 4కు హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంతా ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ షోను హోస్ట్ చేయనుంది. ఆహా ఓటీటీలో

ఆహా వేదికగా సమంతా టాక్ షో.. ఎంజాయ్‌మెంట్‌ మాములుగా ఉండదు..
Follow us on

అక్కినేని నాగార్జున స్థానంలో ‘బిగ్ బాస్’ సీజన్ 4కు హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంతా ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ షోను హోస్ట్ చేయనుంది. ఆహా ఓటీటీలో ‘సామ్ జామ్’ అనే టాక్ షోకు సమంతా వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ‘సామ్ జామ్’ టాక్ షో ప్రసారం కానుంది.

Also Read: Bigg Boss 4: ఇదీ సమంత సత్తా.. దసరా ఎపిసోడ్‌ టీఆర్పీ రేటింగ్‌ అదుర్స్..

సరదాగా సాగే ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు గెస్టులుగా పాల్గొనబోతున్నారు. ఈ టాక్ షోకి దర్శకురాలు నందిని రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, దీనిపై తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సమంతా, నిర్మాత అల్లు అరవింద్, నందినీ రెడ్డి పూర్తి వివరాలను మీడియాతో పంచుకున్నారు.

Also Read: చైతూకు విడాకులు ఇవ్వమన్న నెటిజన్‌కు.. సామ్ క్రేజీ కౌంటర్!