అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకోనున్న ఆలయం

|

Sep 15, 2020 | 2:56 PM

రెండు నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.ఈ మహమ్మారి వలన భక్తులు కి దేవునికి మధ్య దూరం పెరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకోనున్న ఆలయం
Follow us on

Sabarimala Temple Reopen : శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దీపావళి తరువాతే తెరుచుకోనుంది. సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కోసం మార్గదర్శనాలను త్వరలోనే విడుదల చేయనుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయం బోర్డు నిబంధనలు సిద్ధం చేస్తోంది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప దర్శనం ఉండే అవకాశం ఉంది. ఆలయంలో దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది.

ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వామి దర్శనం గురించి వివరించే స్థితిలో లేనందున ప్రత్యేక కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకోవాలని అనుకున్న భక్తులు దర్శనానికి ముందు 14 రోజులు, దర్శనం తర్వాత 10 రోజులు స్వీయ నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. ఆలయంలో జరిపే పూజలకు ఎవరినీ అనుమతించరు.

సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు నెలవారీ ఆరాధన కోసం ఆలయం తెరుచుకోనుంది. అయితే ఈ సమయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతి లేదు. మకర సంక్రాంతి రోజు కనిపించే మకరవిలక్కు, మెట్ల పూజపై మార్గదర్శకాలను త్వరలోనే ఆలయ ప్రత్యేక కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుందిన ప్రకటించింది.