రైతన్నకు అండగా.. వైఎస్ జగన్ భరోసా..

| Edited By:

Jul 08, 2019 | 8:36 AM

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సదస్సులు ఏర్పాటు చేసి.. రైతులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దేశ చరిత్రలోనే నేడు అందరికి గుర్తిండిపోయేలా రైతులకు అండగా రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ.. అన్నదాతలకు చేయూతనిస్తున్నాడు సీఎం జగన్. రైతు భరోసా పథకం కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు […]

రైతన్నకు అండగా.. వైఎస్ జగన్ భరోసా..
Follow us on

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సదస్సులు ఏర్పాటు చేసి.. రైతులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దేశ చరిత్రలోనే నేడు అందరికి గుర్తిండిపోయేలా రైతులకు అండగా రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ.. అన్నదాతలకు చేయూతనిస్తున్నాడు సీఎం జగన్.

రైతు భరోసా పథకం కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ. 8750 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీని ద్వారా 15.36 లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 15 నుంచి ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 12,500 చొప్పున అందిస్తామని చెప్పారు. 2020 మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ, గత అయిదేళ్లలో రైతుల పడిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువు కంటే ముందే అమలు చేస్తున్నామని చెప్పారు. ఒకే విడతలో రైతుల చేతికి ఇంత మొత్తాన్ని అందించటం దేశ చరిత్రలోనే రికార్డు అని అన్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం జగన్ రైతులకు బహిరంగ లేఖ రాశారు.