రేపు వైఎస్ఆర్ వర్ధంతి.. ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్

|

Sep 01, 2020 | 9:13 PM

ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు జరిగే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అయితే ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ...

రేపు వైఎస్ఆర్ వర్ధంతి.. ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
Follow us on

ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి జగన్‌ కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. రేపు జరిగే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అయితే ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ రావడంతో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు సీఎం జగన్‌కు ఆత్మీయస్వాగతం పలికారు.

ఆత్మీయ స్వాగతం పలికినవారిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానుమ్, కడప జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. వారితో ఎంతో ఉల్లాసంగా ముచ్చటించిన సీఎం జగన్ ఆపై వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేసేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి ఇడుపులపాయ నుంచి బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంకు చేరుకుంటారు.