అత్తింటి వేధింపులు తట్టుకోలేక నగ్నంగా పోలీస్ స్టేషన్‌కు

|

May 13, 2019 | 5:44 PM

ఎన్ని చట్టాలు వచ్చినా అత్తింటి వేధింపుల పర్వం మాత్రం ఆగటం లేదు . తాజాగా అత్త, ఆడపడచులు కలిసి ఆ మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చెప్పిన మాట వినడం లేదంటూ విపరీతంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె బట్టలు చింపేశారు. వారి వేధింపులను తట్టుకోలేక నగ్నంగానే ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టింది ఆ కోడలు. అలానే వెళ్లి పోలీసులకు తన గోడును వెళ్లబోసుకుంది. చుట్టు పక్కల ప్రజలు ఆమెకు సాయం చేయకుండా.. సెల్‌ఫోన్‌లో […]

అత్తింటి వేధింపులు తట్టుకోలేక నగ్నంగా పోలీస్ స్టేషన్‌కు
Follow us on

ఎన్ని చట్టాలు వచ్చినా అత్తింటి వేధింపుల పర్వం మాత్రం ఆగటం లేదు . తాజాగా అత్త, ఆడపడచులు కలిసి ఆ మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చెప్పిన మాట వినడం లేదంటూ విపరీతంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె బట్టలు చింపేశారు. వారి వేధింపులను తట్టుకోలేక నగ్నంగానే ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టింది ఆ కోడలు. అలానే వెళ్లి పోలీసులకు తన గోడును వెళ్లబోసుకుంది. చుట్టు పక్కల ప్రజలు ఆమెకు సాయం చేయకుండా.. సెల్‌ఫోన్‌లో ఫోన్‌లో చిత్రీకరించారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఈ దారుణం జరిగింది.

మహారాష్ట్రలోని అకోలాకు చెందిన మహిళకు రాజస్థాన్‌ వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. ఐతే కట్టుకున్న భర్త పని కోసం అసోంకు వెళ్లిపోవడంతో.. ఆ ఒంటరి మహిళను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తూ వచ్చారు .చెప్పిన పని వినకుంటే చితకబాదేవారు. ఇటీవల మరోసారి జరిగిన గొడవలో అత్తా, ఆడపడచులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె బట్టలు చింపి దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక బాధితురాలు నగ్నంగానే  పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తింది. మహిళ పరిస్థితిని చూసి చలించిన పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఆమె రోడ్డుపై పరుగులు తీస్తుంటే మానవత్వం మరచిన కొందరు వినోదంగా ఫోటోలు తీశారు.  చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ దృశ్యాలు రికార్డయ్యాయి. వాటన్నింటినీ పోలీసులు తొలగించి విచారణ జరుపుతున్నారు.