వారంతా దేశద్రోహులు: బీజేపీ ఎమ్మెల్యే

| Edited By:

Dec 31, 2019 | 7:06 PM

రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తున్న వారందరినీ “దేశ ద్రోహులు ” గా వర్ణించారు. బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించండి అని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారందరూ దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ శాసనసభలో ముండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలావర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా […]

వారంతా దేశద్రోహులు: బీజేపీ ఎమ్మెల్యే
Follow us on

రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తున్న వారందరినీ “దేశ ద్రోహులు ” గా వర్ణించారు. బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించండి అని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారందరూ దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్ శాసనసభలో ముండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలావర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులందరూ సిఎఎ వ్యతిరేక నిరసనకారులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

సిఎఎను వ్యతిరేకిస్తున్న వారు పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లను తమ మాతృభూమిగా ఎన్నుకోవాలి అని దిలావర్ వివారించారు. ఒకవేళ ఇరు దేశాలలో దేనినైనా అంగీకరించడానికి ఇష్టపడకపోతే, వారు హిందూ మహాసముద్రంలో దూకాలని ఆయన పిలుపునిచ్చారు.