తెలంగాణ పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు.. డబ్బుల కోసం అమ్ముడుపోతున్నారంటూ వ్యాఖ్య.

|

Dec 22, 2020 | 4:11 PM

బీజేపీ నాయకులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ ఆరోపించారు...

తెలంగాణ పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు.. డబ్బుల కోసం అమ్ముడుపోతున్నారంటూ వ్యాఖ్య.
Follow us on

Raja singh comments on ts police: బీజేపీ నాయకులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి మహారాష్ట్ర నుంచి హైదారాబాద్‌లోని బహుదూర్‌పుర తరలిస్తోన్న ఆవుల లారీ రాజా సింగ్ పట్టుకున్నారు. 45 ఆవులతో శంషాబాద్ మీదుగా వెళ్తున్న లారీని చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద రాజాసింగ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘కొందరు తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఈ సంఘటనపై డీజీపీ స్పందించాలి. ఆవులు, ఎద్దులను వధించటం నేరం. గోవధపై బహుదూర్ పుర మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదు. ఒకవేళ అధికారులు స్పందిచకపోతే మేమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం’ అంటూ చెప్పుకొచ్చారు.