‘2018లో ఉత్తమ పోలీస్ స్టేషన్ల’కు సంబంధించి జాబితాను విడుదల చేసింది కేంద్రం. ఇందులో టాప్ 20లో తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్కు 14వ స్థానం లభించగా, ఏపీ.. విజయనగరం జిల్లాలోని సీతానగరం పీఎస్కు 20వ స్థానం లభించింది. కాగా.. మొదటి స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ పరిధిలో గల ‘కలు’ పోలీస్ స్టేషన్. రెండవ స్థానంలో అండమాన్ నికోబార్లోని ‘క్యాంప్బెల్’ పీఎస్, మూడో స్థానంలో పశ్చిమబెంగాల్లోని ‘ముర్షిదాబాద్’ పోలీస్ స్టేషన్లు నిలిచాయి.