తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్, చాముండేశ్వరి నాధ్, టిటిడి మాజీ జేఈఓ శ్రీనివాస రాజు దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు.. అనంతరం వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం గోపిచంద్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ అనంతరం మొదటిసారి స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నానని,చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరి నుండి బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభం అవుతాయని, ఆటగాళ్లు నిత్యం ప్రాక్టీసు లో పాల్గొంటున్నారని చెప్పారు గోపిచంద్.