అరిచి పరువు తీసుకోవద్దు.. పాకిస్తాన్ యువతికి ప్రియాంక వార్నింగ్

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2019 | 2:00 PM

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించారు. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని అయేషా తప్పుబట్టింది. యూనిసెస్ గుడ్ […]

అరిచి పరువు తీసుకోవద్దు.. పాకిస్తాన్ యువతికి ప్రియాంక వార్నింగ్
Follow us on

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో బ్యూటీ కాన్ పేరిట నిర్వహించిన ఒక షోలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. పలువురు సెలబ్రెటీలు హాజరైన ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిచ్చారు. పాకిస్తాన్‌కు చెందిన అయేషా అనే యువతి కశ్మీర్ పరిణామాలు, సర్జికల్ స్టైక్ విషయంలో ప్రియాంక పై ప్రశ్నలు కురిపించారు. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడుల సందర్భంగా ప్రియాంక జైహింద్ అని ట్వీట్ చేయడాన్ని అయేషా తప్పుబట్టింది. యూనిసెస్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ట్వీట్లు చేయవచ్చా అని ప్రశ్నించింది. పాకిస్తాన్ పై యుద్ధానికి దారి తీసేలా అలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమజసం అంటూ ప్రియాంకను దురుసుగా ప్రశ్నించింది. అయేషా ఆరోపణలకు ప్రియాంక ధీటుగా సమాధానమిచ్చింది. తాను భారతీయురాలినని దేశమంటే తనకు గౌరవం, బాధ్యత ఉన్నాయని స్పష్టం చేసింది. ఊరికే అరిచి పరువు తీసుకోవద్దని హెచ్చరించారు.