ఆర్టీసీ స్ట్రైక్: ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

| Edited By:

Oct 06, 2019 | 11:20 AM

ఆర్టీసీ సమ్మె పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఒక పక్క నగరంలో తిరిగే ఆటోలు, ట్యాక్సీలే కాకుండా జిల్లాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. జంట నగరాల్లో సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్‌ నుంచి అమీర్‌పేటకు ఆటో అయితే.. 100 నుంచి 120 రూపాయలు వసూలు చేస్తే ప్రస్తుతం 500 లేదా 600లు డిమాండ్‌ చేస్తున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సీతాఫల్‌ మండి వెళ్లాలన్నా […]

ఆర్టీసీ స్ట్రైక్: ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
Follow us on

ఆర్టీసీ సమ్మె పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఒక పక్క నగరంలో తిరిగే ఆటోలు, ట్యాక్సీలే కాకుండా జిల్లాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. జంట నగరాల్లో సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్‌ నుంచి అమీర్‌పేటకు ఆటో అయితే.. 100 నుంచి 120 రూపాయలు వసూలు చేస్తే ప్రస్తుతం 500 లేదా 600లు డిమాండ్‌ చేస్తున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సీతాఫల్‌ మండి వెళ్లాలన్నా 10 రూపాయలు తీసుకునే ఆటోవాలాలు శనివారం సమ్మెపేరుతో 30 నుంచి 40 రూపాయలు డిమాండ్‌ చేశారు. ఇలా నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఆటోలు ప్రయాణీకులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఇక జిల్లాలకు వెళ్లే బస్సువాళ్లకు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. దసరా పండగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో ఊళ్లకు వెళ్లేవారు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లేవారి నుంచి ప్రైవేట్‌ ఆపరేటర్లు రెట్టింపు ఛార్జీలు డిమాండ్‌ చేస్తున్నారు.