దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన

|

Dec 06, 2019 | 5:49 PM

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి, […]

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన
Follow us on

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులు ఎన్‌కౌంటర్ అయ్యారు. పోలీసులు ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించి, పోలీసులు ఎదిరించడంతోనే..ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా మృగాళ్ల ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

కాగా ఈ విషయంపై దివంగత నటి ప్రత్యూష తల్లి స్పందించారు.  17 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ.. సమాజంలో పోరాట పటిమ ఇలానే ఉంటే తన కూతురు బ్రతికి ఉండేదని ఎమోషన్ అయ్యారు. నిర్భయ చట్టం లోకి..ప్రత్యూష కేసుని కూడా బదలయించాలి ఆమె పోలీసులను కోరారు. చట్టాలను ఇంకా మార్చాల్సిన అవసరం వచ్చింది.. దిశ పేరుతోనే ఒక చట్టం తీసుకొస్తే , స్త్రీలకు మరింత రక్షణ ఉంటుదన్నారు.  పోలీసులు దేశం దృష్టిని ఈ ఏన్‌కౌంటర్ తో తెలంగాణ వైపు తిప్పుకున్నారని, వారికి అభినందనలు తెలిపారు. తన కూతురికి కూడా త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.