బొమ్మకు పోస్ట్​మార్టం…ఎందుకో తెలుసా..?

|

Jul 12, 2020 | 5:44 PM

పొర‌బ‌డ‌టం కామ‌న్..మ‌రీ ఈ రేంజ్ లోనా..సిట్యువేష‌న్ డిమాండ్ చేస్తే..త‌ప్ప‌దు మ‌రి. మ‌హ‌రాష్ట్రలో బుల్డానాలో ఓ క్రేజీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఇటీవ‌ల ఓ గుర్తుతెలియ‌ని శిశువు మృతదేహాన్ని స్టేషన్​కు తీసుకొచ్చారు పోలీసులు.

బొమ్మకు పోస్ట్​మార్టం...ఎందుకో తెలుసా..?
Follow us on

పొర‌బ‌డ‌టం కామ‌న్..మ‌రీ ఈ రేంజ్ లోనా..సిట్యువేష‌న్ డిమాండ్ చేస్తే..త‌ప్ప‌దు మ‌రి. మ‌హ‌రాష్ట్రలో బుల్డానాలో ఓ క్రేజీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఇటీవ‌ల ఓ గుర్తుతెలియ‌ని శిశువు మృతదేహాన్ని స్టేషన్​కు తీసుకొచ్చారు పోలీసులు. పోస్టుమార్టం అనంత‌రం రిపోర్టు చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు. ఎందుకంటే అది మృతదేహం కాదు జ‌స్ట్ ఆడుకునే బొమ్మ మాత్ర‌మే.

వివ‌రాల్లోకి వెళ్తే.. బుల్డానా జిల్లా ఖామ్​గావ్ తాలూకా బోర్జావాల్ గ్రామంలో గురువారం ఓ శిశువు మృతదేహం నదిలో తేలియాడుతూ కనిపించింది. అది చూసిన గ్రామ‌స్థుల స్థానిక‌ పోలీసులకు విషయాన్ని చేర‌వేశారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచార‌ణ‌లో భాగంగా మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు త‌ర‌లించారు. అక్క‌డ అస‌లు మిస్ట‌రీ వీడింది. అది శిశువు శవం కాదు, అచ్చం చిన్నారిలా కనిపించే ఓ ఆట‌ బొమ్మ మాత్ర‌మే. ​