వారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్..మ‌రో 3 నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం..

|

Jul 08, 2020 | 6:34 PM

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మరో మూడు నెలలపాటు ఫ్రీగానే గ్యాస్ సిలిండర్లు ఇస్తామ‌ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్ల‌డించారు.

వారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్..మ‌రో 3 నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం..
Follow us on

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మరో మూడు నెలలపాటు ఫ్రీగానే గ్యాస్ సిలిండర్లు ఇస్తామ‌ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్ల‌డించారు. జూలై 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపారు. కాగా మరో 3 నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుంద‌ని కూడా మంత్రి తెలిపిన విష‌యం తెలిసిందే.

కాగా మరోవైపు రూ.లక్ష కోట్లతో అగ్రికల్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్ర‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ మినిస్ట‌ర్ నరేంద్ర సింగ్ తోమర్ వెల్ల‌డించారు. దీనికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను ప‌ల్లెల‌కు చేర్చుతామని ఆయన వివ‌రించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి వ‌ర్క్ చేస్తామ‌ని తెలిపారు.