జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే ఎన్నికలు : ప్రధాని మోదీ

|

Aug 09, 2019 | 2:02 AM

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ విషయంపై మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగం కావాలని సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, వాజ్ పాయ్ తదితరులు కలలు కన్నారని, వారి కల నెరవేరిందని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. […]

జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే ఎన్నికలు : ప్రధాని మోదీ
Follow us on

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఈ విషయంపై మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  జమ్మూకశ్మీర్ రాష్ట్రం భారత్ లో అంతర్భాగం కావాలని సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, వాజ్ పాయ్ తదితరులు కలలు కన్నారని, వారి కల నెరవేరిందని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. గతంలో అక్కడ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయని మోదీ అన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది బాగా జరుగుతోందని మోదీ అన్నారు. అలాగే, మరికొన్ని రోజుల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని మోదీ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టే అసెంబ్లీ ఎన్నికలు కూడా శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ ఎమ్మెల్యేను ఎన్నుకోవచ్చని, ముఖ్యమంత్రి కూడా ఉంటారని చెప్పారు.