PM Modi Bengal Visit: భారత ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 23న బెంగాల్లో పర్యటించనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విచ్చేయనున్నారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ఈ ఎన్నికల్లో బెంగాల్ను చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటి నుంచి బెంగాల్పై కన్నేసిన బీజేపీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. తాజాగా మోదీ వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనతో అధికారులు, నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
Also Read: Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ