మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం!

| Edited By:

Aug 24, 2019 | 5:57 PM

యూఏఈలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ శనివారం మోదీని ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ మెడల్‌తో సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ అవార్డు యూఏఈలోనే అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును అందజేశారు. ఇంతకుముందు ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ […]

మోదీకి ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారం!
Follow us on

యూఏఈలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ శనివారం మోదీని ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ మెడల్‌తో సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ అవార్డు యూఏఈలోనే అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును అందజేశారు. ఇంతకుముందు ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, సాదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ తదితరులు అందుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ రెండు నెలల క్రితం ప్రధాని మోదీకి జాయెద్ మెడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.