పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. రోజువారీ చమురు ధరల సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్వల్పంగా పెంచుతూ ప్రభుత్వంరంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో పెట్రోల్పై 12-14 వరకు పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.81.49కి చేరింది. నిన్న పెట్రోల్ ధర రూ.81.35గా ఉన్నది. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56.
అయితే, రాష్ట్రాల్లో పన్నులు ఒక్కోవిధంగా ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులు మార్పులు ఉండనున్నాయి. దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81.49, డీజిల్ రూ.73.56, కోల్కతాలో పెట్రోల్ రూ.83.01, డీజిల్ 77.06, ముంబై పెట్రోల్ రూ.88.16, డీజిల్ రూ.80.11, చెన్నైలో పెట్రోల్ రూ.84.52, డీజిల్ రూ.78.86, ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.84.55 కాగా డీజిల్ ధర రూ.80.17 గా ఉంది.