జాయ్ రైడ్ కూలి.. ముగ్గురి మృతి

|

Jul 15, 2019 | 5:56 PM

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని కంకారియా అడ్వెంచర్ పార్కులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 27 మందికి పైగా గాయపడ్డారు. ఓ జాయ్ రైడ్ పై దాకా వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో రైడ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. ఈ జాయ్ రైడ్ ప్రధాన పైప్ విరిగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీశాడు. ఇప్పటికే ఈ వీడియోను 84 వేలమందికి పైగా […]

జాయ్ రైడ్ కూలి.. ముగ్గురి మృతి
Follow us on

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని కంకారియా అడ్వెంచర్ పార్కులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 27 మందికి పైగా గాయపడ్డారు. ఓ జాయ్ రైడ్ పై దాకా వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో రైడ్ లో దాదాపు 30 మంది ఉన్నారు. ఈ జాయ్ రైడ్ ప్రధాన పైప్ విరిగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీశాడు. ఇప్పటికే ఈ వీడియోను 84 వేలమందికి పైగా చూశారు. ఈ యాక్సిడెంట్ పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా నెటిజన్లు భగ్గుమంటూ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని దుయ్యబడుతున్నారు.