మూడు రాజధానుల అంశంపై పవన్ స్టాండ్ ఏంటి!

| Edited By:

Dec 30, 2019 | 8:17 AM

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ, వ్యూహాత్మక కమిటీల సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయల సీమ కోఆర్డినేషన్ కమిటీతోపాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, […]

మూడు రాజధానుల అంశంపై పవన్ స్టాండ్ ఏంటి!
Follow us on

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాజకీయ వ్యవహారాల కమిటీ, వ్యూహాత్మక కమిటీల సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయల సీమ కోఆర్డినేషన్ కమిటీతోపాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానం తదితర కార్యక్రమాలపై ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. కీలకమైన ఈ సమావేశానికి హాజరైన సభ్యుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారు. కాగా.. ఇటీవల పార్టీ సభ్యులు నాదెండ్ల మనోహర్, నాగబాబు, ముఖ్య నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. అమరావతిలోని రైతులను, ప్రజలను కలుసుకుని.. వివిధ సమస్యలపై చర్చించారు. దీనిపై ఓ నివేదికను కూడా తయారు చేశారు పార్టీ సభ్యులు. ఈ నివేదికను ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు అందచేశారు. ఆ పరిశీలన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.