భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. జూలై 10నుంచి లాక్‌డౌన్!

| Edited By:

Jul 09, 2020 | 5:30 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బీహార్‌ రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు

భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. జూలై 10నుంచి లాక్‌డౌన్!
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బీహార్‌ రాజధాని పట్నాలో ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ‘పట్నాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లో ఈ పెరుగుదల మరీ ఆందోళనకరంగా ఉంది. అందుకే ఈ నెల 10 నుంచి 16 వరకు ఓ వారం పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాం’ అని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కుమార్ రవి పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్‌లో దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు.

[svt-event date=”09/07/2020,12:35AM” class=”svt-cd-green” ]