పాక్ పార్లమెంట్‌లో “మతం” తెచ్చిన రగడ.. బిల్లుకు మోకాలడ్డిన ముస్లిం మంత్రి

| Edited By:

Oct 06, 2019 | 2:25 PM

ముస్లిమేతరులు ప్రధాని, అధ్యక్ష పదవులను చేపట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ నవీద్ అమైర్ జీవా ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే జీవా క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన వారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ అడ్డుకుంది. పాకిస్థాన్ దేశ రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముస్లింలు మాత్రమే ప్రధాన మంత్రి, అధ్యక్ష […]

పాక్ పార్లమెంట్‌లో మతం తెచ్చిన రగడ.. బిల్లుకు మోకాలడ్డిన ముస్లిం మంత్రి
Follow us on

ముస్లిమేతరులు ప్రధాని, అధ్యక్ష పదవులను చేపట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ నవీద్ అమైర్ జీవా ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు బిల్లును ప్రవేశపెట్టారు. అయితే జీవా క్రిస్టియన్ మైనార్టీ వర్గానికి చెందిన వారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ అడ్డుకుంది.

పాకిస్థాన్ దేశ రాజ్యాంగం నిబంధనల ప్రకారం ముస్లింలు మాత్రమే ప్రధాన మంత్రి, అధ్యక్ష పదవులను చేపట్టడానికి అర్హులు అవుతారు. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 41, 91లో ముస్లిం మాత్రమే అత్యున్న పదవిని అలంకరించడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ బిల్లును సవరణ చేయాలని జీవా కోరారు. అయితే పార్లమెంటులో అమైర్ జీవా ప్రతిపాదించిన ఈ సవరణ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అలీ మహ్మద్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు, పాకిస్థాన్ ఇస్లాం స్వతంత్ర రాజ్యమని, కేవలం ముస్లింలు మాత్రమే ప్రధాని, అధ్యక్షుడు అవ్వడానికి అర్హులని తెల్చిచెప్పారు. మరోవైపు, ఈ రాజ్యాంగ సవరణ బిల్లును హక్కుల ఉద్యమకారుడు, జమాతే ఇస్లామీ సభ్యుడు అయిన మౌలానా అబ్దుల్ అక్బర్ చిత్రాలీ స్వాగతించారు.