దిగి వచ్చిన పాక్.. ప్రభుత్వాధీనంలోకి జైషే మహ్మద్ కార్యాలయం

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:24 PM

ఇస్లామాబాద్ : పుల్వామా దాడి తమ పని కాదని ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాక్.. ఎట్టకేలకు వెనకడుగు వేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్‌ దిగివచ్చింది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో.. మరో మార్గం లేక జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు ముందుకొచ్చింది. పంజాబ్ లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పాక్ […]

దిగి వచ్చిన పాక్.. ప్రభుత్వాధీనంలోకి జైషే మహ్మద్ కార్యాలయం
Follow us on

ఇస్లామాబాద్ : పుల్వామా దాడి తమ పని కాదని ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాక్.. ఎట్టకేలకు వెనకడుగు వేసింది. పాక్ లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ఆమోదించిన తర్వాత పాక్‌ దిగివచ్చింది. అగ్రరాజ్యాలన్నీ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించడంతో.. మరో మార్గం లేక జైషే మహ్మద్ సంస్థపై చర్యలకు ముందుకొచ్చింది. పంజాబ్ లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలను పాక్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. బహావల్‌పూర్‌లోని ఆ సంస్థ పాలనా పరమైన కార్యాలయంతోపాటు అదే ప్రాంగణంలో ఉన్న రెండు ఇస్లామిక్ శిక్షణ సంస్థలను కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాదు, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించింది. ఈ సందర్భంగా పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జైషే సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.