చిత్తూరు జిల్లాలో బయటపడ్డ మరో ఆన్లైన్ మోసం.. యాప్ ద్వారా కొనుగోలు చేయెచ్చు అంటూ..
ఇటీవల కాలంలో ఆంద్రప్రదేశ్లో వరుసగా ఆన్లైన్ మోసాలు బయటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా లోన్ మనీ యాప్లతో కొంతమంది
ఇటీవల కాలంలో ఆంద్రప్రదేశ్లో వరుసగా ఆన్లైన్ మోసాలు బయటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా లోన్ మనీ యాప్లతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరువకముందే చిత్తూరు జిల్లాలో మరో ఆన్లైన్ మోసం బయటపడింది. ఓఎంజీ యాప్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసి లాభాలు పొందవచ్చని చెప్పి మోసం చేశారని భాదితులు వాపోతున్నారు. జిల్లాలోని కుప్పం, రామకుప్పం, వికోట, చిత్తూరు, బి.కొత్తకోట మండలాల్లో ఈ యాప్ ద్వారా మోసపోయిన భాదితులు క్రమంగా పెరుగుతున్నారు. ఓఎంజీ యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసి లాభాలు పొందవచ్చని చెబుతూ.. చైన్ లింక్ బిజినెస్తో తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యాప్ నిర్వాకులపై కేసులు పెట్టెందుకు సమీప పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఓఎంజీ యాప్ బిజినెస్ పై ఆరా తీస్తున్నారు. ఈ యాప్ ద్వారా మోసపోయిన వారిని కుప్పం పోలీసులు విచారిస్తున్నారు. ఓఎంజీ యాప్ బిజినెస్ ద్వారా మోసపోయిన వారిలో ఎక్కువగా వ్యాపారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఉన్నారు.