జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ఉగ్రవాదుల అలజడి కొనసాగుతోంది. ఓ వైపు భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడం నిత్య కృత్యం అయిపోయింది. ఇదిలా సాగుతుండగానే.. మరోవైపు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల్లో కాల్పులకు
తెగబడుతోంది. తాజాగా శనివారం ఉదయం కుల్గాం జిల్లాలోని అర్రాహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కూంబింగ్ చేపడుతున్న భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. వెంటనే ఎదురు కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే మృతి చెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందిన వాడన్నది తెలియరాలేదు. మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉండటంతో.. వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది.
#KulgamEncounterUpdate
So far one unidentified terrorist killed. Operation going on. Further details shall follow: Kashmir Zone Police https://t.co/zOtr7rjH7Z— ANI (@ANI) July 4, 2020