కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఒకరు మృతి, 8మందికి గాయాలు

|

Dec 29, 2020 | 8:31 AM

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి.

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. ఒకరు మృతి, 8మందికి గాయాలు
Follow us on

One kills In Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా, మరో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామం శివారులో చోటుచేసుకుంది. ఆదోని నుండి హైదరాబాద్‌కు కూరగాయల లోడుతో వెళ్తున్న ఐచర్ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్క పల్టీకొట్టింది. దీంతో రైతు బోయ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐచర్ వాహనంలో డ్రైవర్‌తో పాటు 9 మంది కూరగాయాల లోడుతో వెళ్తుండగ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.