ఉప్పల్‌లో లారీ బీభత్సం.. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్‌లపైకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరు మ‌ృతి, నలుగురికి గాయాలు

|

Jan 01, 2021 | 11:08 AM

ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పార్కింగ్‌లో ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్తింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మ‌ృత్యువాతపడ్డారు.

ఉప్పల్‌లో లారీ బీభత్సం.. రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్‌లపైకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరు మ‌ృతి, నలుగురికి గాయాలు
Follow us on

అతివేగం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉప్పల్‌లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జెన్‌ప్యాక్ట్‌ సమీపంలోని హనుమాన్‌ దేవాలయం దగ్గర అతివేగంగా దూసుకొచ్చిన లారీ.. డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం వాహనం హనుమాన్‌ టెంపుల్‌ ప్రహారీగోడను ఢీకొట్టి.. పార్కింగ్‌లో ఉన్న బైక్‌లపైకి దూసుకెళ్తింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మ‌ృత్యువాతపడ్డారు. లారీ వెనుక ఉన్న మినీ గూడ్స్‌ వాహనాన్ని కూడా తాకడంతో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు. లోడుతో ఉన్న లారీ అతివేగంగా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. లారీ డ్రైవర్ మద్యం మత్తు, నిర్లక్ష్యంగా నడపడంవలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.