ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇటీవల ప్రభుత్వంతో ఖైదీల విడుదలకు సంబంధించి చర్యలు సఫలమైనప్పటికీ.. తాలిబన్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా కపిసా ప్రావిన్స్లోని అల్ సై జిల్లాలో రాకెట్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ సామన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని కపిసా పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుందని.. ఆఫ్ఘన్ భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య బఝార్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు.
A civilian was killed & 3 others injured when a rocket hit a house in Al-Sai district of Kapisa province. Kapisa police spokesman Shaykh Shurash said the incident took place last night during clashes b/w govt forces & Taliban in Bazaar area of the district: Afghanistan’s TOLOnews
— ANI (@ANI) August 21, 2020
Read More :