నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ఏంటంటే?

| Edited By: Anil kumar poka

Jan 17, 2020 | 9:21 PM

నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు నిందితులలో ఒకరైన పవన్ గుప్తా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పవన్ తరఫు న్యాయవాది టాప్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సంఘటన చోటు చేసుకున్న 2012 డిసెంబర్ 16వ తేదీ నాటికి తాను ఇంకా మైనర్‌నని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఢిల్లీ న్యాయస్థానానికి అందజేసినప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదనేది పవన్ కుమార్ […]

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ఏంటంటే?
Follow us on

నిర్భయ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు నిందితులలో ఒకరైన పవన్ గుప్తా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పవన్ తరఫు న్యాయవాది టాప్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సంఘటన చోటు చేసుకున్న 2012 డిసెంబర్ 16వ తేదీ నాటికి తాను ఇంకా మైనర్‌నని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఢిల్లీ న్యాయస్థానానికి అందజేసినప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదనేది పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది వాదన.