జగన్‌ని ఫాలో అవుతున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌

| Edited By:

Jul 01, 2020 | 4:21 PM

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రానికి వరుసగా ఐదోసారి సీఎంగా పనిచేస్తున్న నవీన్‌ పట్నాయక్‌., దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన సర్వేలో పాపులర్‌ సీఎంల లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కూడా సంపాదించారు.

జగన్‌ని ఫాలో అవుతున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌
Follow us on

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రానికి వరుసగా ఐదోసారి సీఎంగా పనిచేస్తున్న నవీన్‌ పట్నాయక్‌., దేశవ్యాప్తంగా ఇటీవల జరిపిన సర్వేలో పాపులర్‌ సీఎంల లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కూడా సంపాదించారు. ఇదిలా ఉంటే నవీన్.. ఇటీవల ఓ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారు. అదేంటంటే.. ఒడిశాలో కరోనా కేసులు 7వేలను దాటేశాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత అక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండగా.. సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇతర ప్రదేశాల నుంచి ఒడిశా‌కి వచ్చే వారు నిబంధనలను అనుసరిస్తూ ఇనిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో గానీ హోమ్‌ క్వారంటైన్‌లో గానీ ఉండే వారికి రూ.2వేల రూపాయలు ఇస్తామని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తిని తగ్గించే అవకాశంతో పాటు క్వారంటైన్‌లో ఉండేందుకు అందరినీ ఎంకరేజ్‌ చేసినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే నవీన్‌ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు క్వారంటైన్‌ సెంటర్‌లో గార్డెనింగ్‌ లాంటి పనులు చేస్తే రోజుకు రూ.150 చెల్లిస్తామని కూడా నవీన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఏపీలో కరోనాను జయించిన వారికి రూ.2వేల రూపాయలను జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దీని వలన కరోనా బాధితుల్లో ధైర్యం నింపే అవకాశం ఉంటుందని జగన్ ఓ సందర్భంలో ప్రకటించిన విషయం తెలిసిందే.