NTR Trivikram New Movie Update: ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దిరి కాంబినేషనల్లో ఇది వరకు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో రానున్న మరో సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇందుకుతగ్గట్లే నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై గత కొన్ని రోజులుగా వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలా మంది నటీమణుల పేర్లు వినిపించిన్పటికీ ఏ ఒక్క పేరును చిత్ర యూనిట్ ఫైనల్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. తను ఎవరో కాదు.. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న కన్నడ భామ రష్మిక మందన. అవును.. ఈ చిన్నదే ఇప్పుడు ఎన్టీఆర్తో స్టెప్పులు వేయనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ఇక ‘అయినను పోయిరావలెను’ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అయితే కేవలం పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి.. సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని టాక్.
Also Read: Titanic movie: ‘టైటానిక్’ మూవీ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..