No Clarity On Inter State RTC Services: కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులపై పునరుద్ధరణపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ హైదరాబాద్లోని బస్ భవన్లో ఇరు రాష్ట్రాల అధికారులు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. సర్వీసులు నడపడంపై స్పష్టత రాలేదు.
Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..
తెలంగాణలో 1.25 లక్షల కిలోమీటర్ల మేర ఏపీ బస్సులు తిరుగుతున్నాయని.. వాటిని తగ్గించుకోవాలని టీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ సర్వీసులపై కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. దీనితో ఏపీ అధికారులు మరోసారి భేటి అవుతామని సూచించారు.
Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..