No Charges On UPI Transaction: ప్రస్తుతం అంతా యూపీఐ ట్రాన్సాక్షన్ల హవా నడుస్తోంది. పది రూపాయల ఛాయ్ నుంచి రూ. వేలు విలువ చేసే వస్తువుల వరకు అంతా ఫోన్ ద్వారా పేమెంట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా పేటీఎమ్, ఫోన్పే, అమేజాన్పే, గూగుల్పే వంటి మొబైల్ వ్యాలెట్లు అందుబాటులోకి వచ్చాక యూపీఐ ట్రాన్సాక్షన్లు బాగా పెరిగిపోయాయి.
అయితే ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న ఈ సేవలకు జనవరి 1నుంచి ఛార్జీలు వసూళు చేస్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టత ఇచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఛార్జీలు వసూలు చేస్తారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులోనూ యూపీఐ ట్రాన్సక్షన్లకు అదనపు రుసుము వసూళ్లు ఉండబోవని తేల్చి చెప్పింది.
Also Read: Car Loans : కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త..తక్కువ వడ్డీ రేట్లకే రుణాలిస్తున్న బ్యాంకులు