ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం

|

Oct 09, 2020 | 8:04 PM

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా‌ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన‌ 24 మందిలో 21 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం
Follow us on

Nizamabad By-Poll : నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా‌ ముగిసింది. ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మొత్తం 824 ఓట్లకుగాను 821 ఓట్లు పోలయ్యాయి. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన‌ 24 మందిలో 21 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 19 మంది పీపీఈ కిట్లు ధ‌రించి ఓటేయ‌గా మిగ‌తా ఇద్ద‌రు పోస్ట‌ల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు.

‌ఉపఎన్నిక బరిలో అధికార టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ ఎన్నికల బరిలో నిలిచారు. బ్యాలెట్‌ పద్దతిలో ఉపఎన్నిక పోలింగ్‌ జరిగింది. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ నిర్వహణను చేపట్టారు.

ఎక్స్‌అఫీషియో సభ్యులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేశారు. ఈ నెల 12న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.