వరసగా రెండోసారి కేంద్రబడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. పోయిన ఏడాది బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా ఎర్రటి సంచిలో పద్దులను పార్లమెంట్కు తీసుకువచ్చారు. కాగా.. సీతారామన్ బడ్జెట్ వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్కు విచ్చేశారు. పార్లమెంట్ సిబ్బంది వారందర్నీ గౌరవంగా లోపలికి ఆహ్వానించారు.