సాయమే దేవుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన మాట. అవును మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేసినా దేవుడులాగే కనిపిస్తారు. సాయం పొందినవారు, చేసినవారు విభిన్న మార్గాల్లో కృతజ్ఞత చూపిస్తారు. తాజాగా ఓ గవర్నమెంట్ అధికారి చేసిన సాయానికి గుర్తుగా ఓ జంట.. తమకు పుట్టిన బిడ్డకు అధికారి పేరు పెట్టుకుంది.
కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యే వరకు అక్షత బాగోగులను ఆస్పత్రి డిప్యూటీ కమిషనర్ ఎస్ఎస్ నకుల్ చూసుకున్నారు. ఆయన సంరక్షణ, ఆప్యాయత, ప్రేమకు మెచ్చిన దంపతులు.. తమ కుమారుడికి ఆయన పేరే పెట్టుకున్నారు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ ఎస్ఎస్ నకుల్ హర్షం వ్యక్తం చేశారు. పసిబిడ్డతో పాటు దంపతులు సంతోషంగా ఉండాలని దీవించారు.
Also Read :
ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు
ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు