ముంబైలో దారుణం.. 21 అంతస్తుల భవనం నుండి శిశువు విసిరివేత!

| Edited By: Srinu

Dec 06, 2019 | 4:09 PM

ముంబైలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. కందివాలిలోని 21 అంతస్తుల భవనం నుండి నవజాత శిశువును విసిరివేసారు. దీంతో ఆ శిశువు మృతిచెందిందని పోలీసులు తెలిపారు. జై భారత్ కాంప్లెక్స్ యొక్క పై అంతస్తులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శిశువును బాత్రూమ్ కిటికీ నుండి విసిరివేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక పరీక్షలు జరిపిన తరువాత.. ఆ శిశువు కొద్ది గంటల ముందే జన్మించిందని, బొడ్డు తాడులో కొంత భాగం ఇంకా అంటుకుని ఉందని అధికారి […]

ముంబైలో దారుణం.. 21 అంతస్తుల భవనం నుండి శిశువు విసిరివేత!
Follow us on

ముంబైలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. కందివాలిలోని 21 అంతస్తుల భవనం నుండి నవజాత శిశువును విసిరివేసారు. దీంతో ఆ శిశువు మృతిచెందిందని పోలీసులు తెలిపారు. జై భారత్ కాంప్లెక్స్ యొక్క పై అంతస్తులో ఒక గుర్తు తెలియని వ్యక్తి శిశువును బాత్రూమ్ కిటికీ నుండి విసిరివేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక పరీక్షలు జరిపిన తరువాత.. ఆ శిశువు కొద్ది గంటల ముందే జన్మించిందని, బొడ్డు తాడులో కొంత భాగం ఇంకా అంటుకుని ఉందని అధికారి తెలిపారు. శిశువును ఏ ఫ్లాట్ నుండి విసిరివేశారో ఇంకా తెలియరాలేదు. భవనం యొక్క కాపలాదారు మృతదేహాన్ని గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశాడు. పోలీసులు సిసిటివి ఫుటేజీని పరిశీలించి అక్కడి వారిని ప్రశ్నిస్తున్నారు