టీడీపీ నేతపై రేప్ కేసు.. పోలీసుల దర్యాప్తు

|

May 17, 2020 | 7:41 PM

నెల్లూరు జిల్లాలో దారుణ చోటుచేసుకుంది. మైనర్ బాలికపై తెలుగుదేశం నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విన్నమాల విలేజ్ కి చెందిన దార్ల మోహన్‌ నాయుడుపేట సిటీ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి నాయుడుపేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు. మరో ఘటనలో బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నాయుడుపేట […]

టీడీపీ నేతపై రేప్ కేసు.. పోలీసుల దర్యాప్తు
Follow us on

నెల్లూరు జిల్లాలో దారుణ చోటుచేసుకుంది. మైనర్ బాలికపై తెలుగుదేశం నాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విన్నమాల విలేజ్ కి చెందిన దార్ల మోహన్‌ నాయుడుపేట సిటీ టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి నాయుడుపేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

మరో ఘటనలో బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నాయుడుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీలోని ఓ ఏరియాకు చెందిన బాలికపై తుమ్మూరుకు చెందిన సగుటూరు వెంకటేశ్‌ అనే యువకుడు కన్నేశాడు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి లొంగదీసుకున్నాడు. రీసెంట్ గా బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పడంతో ఆమె నాయుడుపేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో వెంకటేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.