హైదరాబాద్‌లో ‘క్యాన్సర్’ మరణ మృదంగాలు..! ఒక్క నెలలోనే..

| Edited By: Srinu

Nov 22, 2019 | 4:05 PM

హైదరాబాద్‌లో దాదాపు ఒక నెలలో.. చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. మరణిస్తున్నారని.. తాజాగా.. విడుదలైన ఓ నివేదికలో వెల్లడయ్యింది. అంతేకాకుండా.. క్యాన్సర్‌ను గుర్తించే లోపే.. బాధితులు చనిపోతున్నారని.. పలు ఆస్పత్రులు కూడా.. క్యాన్సర్ లాస్ట్‌ స్టేజ్‌లో ఉన్న కారణంగా.. వారికి వైద్యం చేయడానికి కూడా నిరాకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడయ్యింది. దాదాపు 20- 25 వేల మంది క్యాన్సర్ పేషంట్స్.. లాస్ట్ స్టేజ్‌లో ఇబ్బంది పడుతూ మరణిస్తున్నట్లు.. నివేదికలో తేలింది. అంతేకాకుండా.. 2-3వేల మంది హెచ్‌ఐవీ చివరి […]

హైదరాబాద్‌లో క్యాన్సర్ మరణ మృదంగాలు..! ఒక్క నెలలోనే..
Follow us on

హైదరాబాద్‌లో దాదాపు ఒక నెలలో.. చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. మరణిస్తున్నారని.. తాజాగా.. విడుదలైన ఓ నివేదికలో వెల్లడయ్యింది. అంతేకాకుండా.. క్యాన్సర్‌ను గుర్తించే లోపే.. బాధితులు చనిపోతున్నారని.. పలు ఆస్పత్రులు కూడా.. క్యాన్సర్ లాస్ట్‌ స్టేజ్‌లో ఉన్న కారణంగా.. వారికి వైద్యం చేయడానికి కూడా నిరాకరిస్తున్నట్లు నివేదికలో వెల్లడయ్యింది.

దాదాపు 20- 25 వేల మంది క్యాన్సర్ పేషంట్స్.. లాస్ట్ స్టేజ్‌లో ఇబ్బంది పడుతూ మరణిస్తున్నట్లు.. నివేదికలో తేలింది. అంతేకాకుండా.. 2-3వేల మంది హెచ్‌ఐవీ చివరి దశలో ఉండగా..  ఏకంగా.. మూడు లక్షల మంది టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎంఎన్‌జే కాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ ఎన్ జయలత పేర్కొన్నారు.

కాగా.. వీరికి కూడా వైద్యం చేసేందుకు.. పలు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయని.. వారు ఆఖరికి బాధపడుతూనే మరణిస్తున్నట్లు ఆమె చెప్పారు. అలాగే.. వారికి ఉండే బాధ తగ్గించేందుకు.. హైదరాబాద్‌లో కేవలం రెండు ఆస్పత్రులే ఉన్నాయని.. అవి చాలా ఖర్చుతో కూడుకున్నదని.. తెలిపారు. ఆస్పత్రుల్లో కూడా కేవలం 100 నుంచి 120 మంది మాత్రమే చికిత్స అందిస్తారని.. దీంతో.. చాలా మంది.. మరణిస్తున్నారని డాక్టర్ జయలత పేర్కొన్నారు.